ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. NIAకు అప్పగింత

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-11 10:17:11  IST  )

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తును కేంద్రం NIAకు అప్పగించింది. ఈ కేసుపై ఎన్ఐఏ సంస్థ సమగ్ర దర్యాప్తు చేసి నివేదికను..

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. NIAకు అప్పగింత
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. దీనిపై తాజాగా స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ.. నిందితులెవరైనా సరే వదిలిపెట్టబోమన్నారు. తాజాగా ఈ కేసు దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి అప్పగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్‌ఐఏ టీమ్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి త్వరలోనే పూర్తి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించిన ముగ్గురు అనుమానితుల్ని పుల్వామాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షహీన్ షాహిద్ కూడా ఉంది. సెక్టార్ 56లోని అద్దె ఇంటిలో భారీగా పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Next Story